గన్నవరం హైవే పై అర్ధరాత్రి ఆగిన ట్రావెల్స్ బస్సు.. ఏకంగా 36 మంది ప్రయాణికులు !

-

కృష్ణా జిల్లా గన్నవరం బాపులపాడు హైవే పై పైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రయాణీకులు అగచాట్లు పడ్డారు. తెల్లవారుజాము నుంచి హైవేపై బస్సు నిలిచిపోయింది. బస్సులో 36 మంది ప్రయాణికులు ఉన్నారు. వైజాగ్ నుండి హైదరాబాద్ వెళుతుండగా అర్ధరాత్రి 2 గంటలకు ఆగిపోయింది ఎలిగన్స్ ట్రావెల్ బస్సు. దీంతో అర్ధరాత్రి 2 గంటల నుండి చిన్న పిల్లలతో నడి రోడ్డుపై పడిగాపులు కాస్తున్నారు ప్రయాణికులు.

Travels bus stopped at midnight on Gannavaram highway

మీ డబ్బులు మీకు ఇస్తాము వెళ్ళండి అని నిర్లక్ష్యపు సుమాధానం చెబుతోంది ఎలిగన్స్ ట్రావెల్స్ యాజమాన్యం. అందులో ఓ మహిళ 11 గంటలకు ఉద్యోగం కోసం సర్టిఫికెట్లు అందజేయాల్సి ఉంది. ఇప్పుడు నా పరిస్థితి ఏమిటి అని ఆందోళన చెందుతోంది మహిళ. దిక్కుతోచని స్థితిలో వీరవల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు ప్రయాణికులు. ఈ ఘటనా స్థలానికి చేరుకున్న వీరవల్లి పోలీసులు…. డ్రైవర్, క్లినర్ లను అదుపులోకి తీసుకొని స్టేషన్ కు తరలించారు.

Read more RELATED
Recommended to you

Latest news