Tsrtc : శ్రీశైలం వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక ధరలు !

-

 

శ్రీశైలం వెళ్లే భక్తులకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. ఆర్టీసీ బస్సుల్లో టికెట్లు తీసుకునేవారికి ఆలయ దర్శన టికెట్లు బుక్ చేసుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. రోజు 1,200 దర్శన టికెట్లు ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి.

TSRTC good news for devotees going to Srisailam

ఈ మేరకు దేవస్థానం, ఆర్టీసీ మధ్య ఒప్పందం కుదిరింది. స్పర్శ దర్శనం టికెట్ రూ. 500, అతి శీఘ్రదర్శనం రూ. 300, శీఘ్రదర్శనం రూ.150గా ఉంటుందని ఆర్టీసీ వర్గాలు తెలిపాయి.హైదరాబాద్‌ నుంచి శ్రీశైలంకు ప్రతి 50 నిమిషాలకు ఒక ఏసీ బస్సు, ప్రతి 20 నిమిషాలకు ఓ సూపర్‌లగ్జరీ బస్సు ప్రయాణికులకు అందుబాటులో ఉంటుందని ఆర్టీసీ రంగారెడ్డి రీజియన్‌ ఆర్‌ఎం శ్రీధర్‌ తెలిపారు.

మరోవైపు హైదరాబాద్‌ – శ్రీశైలం ఏసీ బస్సులు వారం రోజుల్లోగా ప్రయాణికులకు అందుబాటులోకి వస్తాయని ఆర్టీసీ వర్గాలు తెలిపాయి. పెద్దలకు జేబీఎస్‌ నుంచి రూ.750, పిల్లలకు రూ.540. ఎంజీబీఎస్‌ నుంచి రూ.700, రూ.510గా ఛార్జీలను ఖరారు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news