నేటి నుంచి తిరుమల సర్వదర్శనం స్లాట్ టోకెన్ల జారీ

-

ఈరోజు నుంచి టీటీడీ స్వామి వారి దర్శనానికి సంబంధించి సర్వ దర్శనం స్లాట్ టోకెన్లను జారీ చేయనుంది. ప్రతి రోజూ 3వేల టికెట్లను జారీ చేయనుంది. ఉదయం 5 గంటల నుంచి అలిపిరి వద్ద టోకెన్లు జారీ చేయనుంది టీటీడీ. టికెట్లు తీసుకున్న భక్తులు మరుసటి రోజు శ్రీవారిని దర్శించుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. మరో పక్క లాక్ డౌన్ సమయంలో ఆర్జిత సేవలు టిక్కెట్లు పొంది స్వామి వారిని దర్శించుకో లేకపోయిన భక్తులకు కూడా టీటీడీ శుభవార్త చెప్పింది.

దర్శనం వద్దనుకునే భక్తులు.. డిసెంబర్‌ ఆఖరు వరకూ డబ్బులు రీఫండ్‌ చేసుకునే వెసులుబాటు కల్పించింది. మార్చి 13 నుంచి జూన్‌ 30వరకూ టికెట్లు పొందిన భక్తులకు ఈ అవకాశం ఉంది. ఒకవేళ టికెట్లు రద్దు చేసుకునేందుకు ఇష్టపడకపోతే అలాంటి భక్తులు డిసెంబర్ ఆఖరులోగా స్వామి వారిని దర్శించుకునే వెసులు బాటు కల్పించింది. దీంతో టికెట్ బుక్ చేసుకున్న ఎంతో మంది భక్తులకి ఈ వెసులుబాటు కలిగించనుంది.

Read more RELATED
Recommended to you

Latest news