తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నేడు టికెట్స్ విడుదల

-

తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్. నేడు టికెట్స్ విడుదల కానున్నాయి. తిరుమల శ్రీవారి ఏప్రిల్ నెల అర్జిత సేవా టికెట్లు నేడు ఉదయం పదిగంటల నుంచి 20న ఉదయం 10 వరకు అందుబాటులో ఉండనున్నాయి.

TTD will release tickets for the month of April online today

లక్కీ డిప్ లో టికెట్లు పొందిన వారు 22న మధ్యాహ్నం 12 లోగా రుసుము చెల్లించాలి. 22న ఉదయం 10కి కల్యాణోత్సవం, అర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవా టికెట్లు, మధ్యాహ్నం 3కి వర్చువల్ సేవా టికెట్లు, 24న ఉదయం 10కి ఏప్రిల్ నెల రూ. 300 స్పెషల్ దర్శనం టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. పూర్తి వివరాలు, టికెట్ల కోసం టీటీడీ వెబ్ సైట్ లో చూడండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version