సినీ నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణ మురళిని రెండు రోజుల పోలీసు కస్టడీకి అనుమతిస్తూ పల్నాడు జిల్లా నరసరావు పేట కోర్టు అనుమతించింది. కోర్టు ఆదేశాల మేరకు నరసరావు పేట పోలీసులు శనివారం, ఆదివారం విచారించనున్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆయన పై టీడీపీ నేత కిరణ్ ఫిర్యాదు చేసిన విషయం విధితమే.
దీంతో పోసాని ని అదుపులోకి తీసుకున్న పల్నాడు పోలీసులు ఇటీవల నరసరావు పేట కోర్టులో హాజరుపరిచారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం అతనికి మార్చి 13 వరకు రిమాండ్ విధించడంతో గుంటూరు జైలుకు తరలించారు. పోసాని కస్టడీ కోరుతూ నరసరావు పేట పోలీసులు పిటిషన్ వేశారు. విచారణ జరిపిన న్యాయ స్థానం పోసాని ని కస్టడీకి అనుమతి ఇస్తూ శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది.