అమరావతి రాజధాని వచ్చే వరకు కొట్లాడతా – శ్రీదేవి

-

అమరావతి రాజధాని వచ్చే వరకు కొట్లాడతానని..రాజధాని రైతుల టెంట్ లోనే నేను కూర్చుంటానని ప్రకటన చేశారు ఉండవల్లి శ్రీదేవి. వైసీపీ గుండాలు నన్ను వేధిస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి హాట్‌ కామెంట్స్ చేశారు. గత మూడు రోజులు గా వైసీపీ గుండాలు నన్ను వేధిస్తున్నారని ఫైర్‌ అయ్యారు. నేను అజ్ఞాతం లో ఉన్నానని అంటున్నారని.. మొన్న డాక్టర్ సుధాకర్ లాంటి వాళ్ళ లాగా నన్ను చంపుతారు అని అజ్ఞాతం లోకి వెళ్ళానని చెప్పారు.

వాళ్ళ దందాలకు నేను అడ్డు వస్తున్నాను అని ఇలా చేస్తున్నారు.. నేను ఓటు వేసే టేబుల్ కింద ఎవరైనా కూర్చున్నారా అని నిలదీశారు. లేదా సీసీ కెమెరా పెట్టారా అని ప్రశ్నించారు. నేను ఓటు వేసే ప్యానెల్ లో జనసేన ఎమ్మెల్యే ఉన్నాడు… మిగతా అసంతృప్తి ఎమ్మెల్యేలు ఉన్నార న్నారు. వాళ్ళ మీద ఎందుకు అనుమానం పడట్లేదు.. నన్ను ఎందుకు వేధిస్తున్నారని ప్రశ్నించారు. న న్ను పిచ్చి కుక్క లాగా నిందవేసి బయటకు పంపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు వైసీపీ ఎమ్మెల్యే ఉండ వల్లి శ్రీదేవి.

Read more RELATED
Recommended to you

Exit mobile version