ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఏపీలో ఉన్న నిరుద్యోగులకు తీపి కబురు అందిస్తూ.. నిరుద్యోగ భృతి పై కీలక ప్రకటన చేసింది. ఈ సంవత్సరంలోపు నిరుద్యోగ భృతి అమలు చేసి తీరుతామని ఈ సందర్భంగా ఏపీ మంత్రి నారా లోకేష్ ప్రకటించడం జరిగింది. నిరుద్యోగుల ఖాతాలలో నెల నెల డబ్బులు జమ చేస్తామని కూడా వెల్లడించారు.

ఇందుకు సంబంధించిన విధివిధానాలపై కసరత్తు చేస్తున్నట్లు ఈ సందర్భంగా స్పష్టం చేశారు మంత్రి నారా లోకేష్. కాగా 2024 ఎన్నికల కంటే ముందు నిరుద్యోగులకు నెలకు 3000 చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని కూటమి పార్టీలు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ హామీ మేరకు ఇప్పుడు నెలకు 3000 చొప్పున ఇచ్చేందుకు సిద్ధమైంది ఏపీ కూటమి ప్రభుత్వం.