T20 World Cup 2024: స్టాప్ క్లాక్ ఎఫెక్ట్.. భారత్‌కు 5 పరుగులు

-

T20 World Cup 2024: నిన్న USతో మ్యాచ్ లో భారత్ కు అదృష్టం కలిసి వచ్చింది. 30 బంతుల్లో 35 రన్స్ చేయాల్సి ఉన్నప్పుడు స్టాప్ క్లాక్ రూల్ వల్ల 5 పరుగులు కరిగిపోయాయి. ICC కొత్త రూల్ ప్రకారం ఓవర్ ముగిశాక 60 సెకండ్లలో మరో ఓవర్ మొదలుపెట్టాలి.

USA penalised 5 runs vs India

ఇన్నింగ్స్ లో US జట్టు ఇలా చేయడంలో మూడుసార్లు విఫలమవడంతో అంపైర్లు ఐదు పరుగులు జరిమానా విధించారు. దీంతో భారత్ లక్ష్యం తగ్గిపోయింది. మొత్తంగా 111 పరుగుల టార్గెట్ ను 18.2 ఓవర్లలో చేదించింది.

కాగా, అమెరికాపై భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో గ్రూప్-Aలో హ్యాట్రిక్ గెలుపులతో రోహిత్ సేన సూపర్-8కు చేరింది. ఇవాల్టి మ్యాచ్ లో తోలుత US 110/8 స్కోర్ చేయగా, టీం ఇండియా 18.2 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది.

Read more RELATED
Recommended to you

Latest news