మహిళలపై కన్నేసి.. ఖతం చేస్తున్నావా…నారాయణ! – విజయసాయి

-

మహిళలపై కన్నేసి.. ఖతం చేస్తున్నావా…నారాయణ అంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్‌ పెట్టాడు. మాజీ మంత్రి నారాయణ ఒక డేగలా తనపై కన్నేసాడంటూ ఆయన తమ్ముడి భార్య సంచలన ఆరోపణలు చేశారు. “డేగ… ఒక పిట్టను ఎత్తుకెళ్లినట్టు నా పరిస్థితి మారింది.ఇంట్లో భార్య ఉండగానే నేను అన్నం తీసుకురాలేదని నారాయణ కొట్టాడు. నన్ను టార్చర్ చేసేవాడు” అంటూ నారాయణ తమ్ముడి భార్య ప్రియా ఆవేదన వ్యక్తం చేశారు.

నారాయణ నన్ను తీవ్రంగా హింసిస్తున్నారు. అర్ధరాత్రి పూట నన్ను టార్చర్ పెడుతున్నారంటూ ఇన్ స్టాగ్రామ్ వేదికగా ప్రియా పొంగూరు కన్నీటి పర్యంతమయ్యారు. అయితే.. ఈ విషయంపై విజయసాయిరెడ్డి స్పందించారు. వావీ వరసలు లేకుండా సొంత కుటుంబసభ్యులనే కాదు ప్రజల్ని, చివరికి తన సంస్థల్లో పనిచేసే మహిళా ఉద్యోగులు, చదువుకుంటున్నమైనర్ బాలికలను కూడా ఇలానే వేధిస్తున్నారని ఆగ్రహించారు. గద్దలు, డేగలు కోడి పిల్లల్ని తన్నుకుపోవడానికి పైనుంచి గురి చూసినట్లే అమాయక అబలలపై కన్నేసి వారిని ఖతం చేస్తున్నారు…నారాయణ! నారాయణ! నారాయణ! అంటూ పోస్ట్‌ పెట్టాడు సాయిరెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news