ఏపీలో 90% మంది టీడీపీ ఎమ్మెల్యేలది అవినీతే – విజయసాయిరెడ్డి

-

ఏపీలో 90% మంది టీడీపీ ఎమ్మెల్యేలది అవినీతి చేశారని ఆరోపనలు చేశారు విజయసాయిరెడ్డి. ఏపీలో కమీషన్లు, ముడుపులు, దందాలతో దారితప్పిన టీడీపీ ఎమ్మెల్యేలు అంటూ విజయసాయి పోస్ట్‌ పెట్టారు. 90% మంది టీడీపీ ఎమ్మెల్యేల అవినీతి పరాకాష్టకు చేరడంతో 4 నెలల్లోనే చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేక ప్రభావం ఉందని… పోస్టింగులకు ఒక రేటు, మద్యంలో నెలమామూళ్లు, వెంచర్లలో కమీషన్లు, కాంట్రాక్టర్ల దగ్గర పెర్సెంటేజిలు, ప్రొటెక్షన్ మనీ, అంటూ బరితెగించిన టీడీపీ ఎమ్మెల్యేలు అంటూ ఆగ్రహించారు.

vijayasai reddy comments on chandrababu naidu over oct 8th

గత ప్రభుత్వ హయాంలో టీడీపీ గూఢచారులుగా ప్రవర్తించిన అధికారులకు క్లీన్‌ చిట్‌లు, మంచిరాబడి ఉన్న పోస్టింగులు, పదోన్నతులు అని… మద్యంషాపుల దరఖాస్తుల్లో టీడీపీ ఎమ్మెల్యేలు సిండికేట్ అయ్యి సర్కార్ ఖజానాకు గండి పడిందని పేర్కొన్నారు. లిటిగేషన్లు, నోటిదురుసులు, వ్యభిచారాలు, ఆమ్యామ్యాలు, మాఫియాలు, దందాలు, బ్లాక్మెయిలింగ్, వెంచర్లు, మద్యం….,.దేన్నీ వదలకుండా టీడీపీ ప్రజాప్రతినిధులు అడ్డగోలుగా దిగమింగే దాంట్లో పూర్తి నిమగ్నం అయ్యారన్నారు. ఐదు సంవత్సరాల తర్వాత అవకాశం దొరికినప్పుడు మేం మింగితే తప్ప్పేమిటి……మళ్ళీ మళ్ళీ అవకాశం వస్తుందో రాదో …..అని అడ్డంగా సమర్ధించుకుంటున్న తెలుగు తమ్ముళ్లు అంటూ సెటైర్లు పేల్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version