వారిద్దరి సక్సెస్ వెనుక కమిన్స్ దే కీలక పాత్ర : పాక్ మాజీ క్రికెటర్

-

ప్రస్తుతం టీమిండియా బంగ్లాదేశ్ తో టీ 20 సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రెండు మ్యాచ్ లలో భారత్ విజయం సాధించింది. ప్రధానంగా రెండో టీ 20లో తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి ఆల్ రౌండ్ షో చేశాడు. బ్యాటింగ్ లో హాఫ్ సెంచరీ సాధించిన నితీష్.. బౌలింగ్ లో కూడా రెండు వికెట్లు తీశాడు. మరోవైపు ఓపెనర్ గా వచ్చిన అభిషేక్ శర్మ దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించాడు. అంతకుముందు ఆడిన సిరీస్ లో నాణ్యమైన ఆటతీరును ప్రదర్శించాడు.

వీరిద్దరూ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. పాట్ కమిన్స్ ఎస్ఆర్ హెచ్ ను ఫైనల్ కు చేర్చాడు. బంగ్లాతో సిరీస్ లో రాణిస్తున్నన నితీష్, అభిషేక్ సక్సెస్ వెనుక పాట్ కమిన్స్ దే కీలక పాత్ర ఉందని పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బసిత్ అలీ పేర్కొన్నారు. వీరిద్దరికీ ఈ సీజన్ తరువాతనే టీమిండియా నుంచి పిలుపు వచ్చినట్టు గుర్తు చేశారు. ఐపీఎల్ లో వీరిద్దరికీ ఎక్కువ అవకాశాలు ఇచ్చాడు కమిన్స్ అని బసిత్ అలీ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version