జగన్ మళ్లీ ఎందుకు గెలిపించాలో ప్రజలకు వివరించాలి – విజయసాయిరెడ్డి

-

వైసీపీ ప్రభుత్వాన్ని మళ్లీ ఎందుకు గెలిపించాలో ప్రజలకు వివరించాలని వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయ సాయి రెడ్డి నేతలకు దిశానిర్దేశం చేశారు. వరుసగా రెండు రోజుల పాటు అనుబంధ విభాగాల నేకలతో సమావేశమైన వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయ సాయి రెడ్డి… ఎన్నికల్లో అనుబంధ విభాగాలు చేపట్టాల్సిన కార్యక్రమాలపై విజయసాయి దిశా నిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి మాట్లాడుతూ… సంక్షేమ కార్యక్రమాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలని… పార్టీ అనుబంధ విభాగాలకు త్వరలో జోనల్ స్థాయిలో సమావేశాలు నిర్వహిస్తామని చెప్పారు. క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని.. మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో అనుబంధ విభాగాల కమిటీలను ఏర్పాటు చేసి ఆయా కమిటీల్లో సభ్యులను భర్తీ చేయాలని పిలుపునిచ్చారు. ఆయా కమిటీల ద్వారా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు మరింత వివరించాలని.. వైసీపీ ప్రభుత్వాన్ని మళ్లీ ఎందుకు గెలిపించాలో ప్రజలకు వివరించాలన్నారు. గతంలో విద్యా వ్యవస్థ ఎలా ఉంది? ఈ నాలుగేళ్ల కాలంలో తీసుకొచ్చిన సంస్కరణలు అందరికీ వివరించాలని.. విద్యా వ్యవస్థలో పురోగతి కార్యక్రమాన్ని జోనల్, జిల్లా స్థాయిలో చేపట్టాలని పేర్కొన్నారు విజయసాయి రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news