చంద్రబాబు పై విజయసాయి రెడ్డి ట్వీట్..!

-

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పై వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి ఓ ట్వీట్ చేశారు. ముఖ్యంగా ఇటీవల చంద్రబాబు నాయుడికి ఐటీ నోటీసులు పంపించింది. దీంతో రెండు మూడు రోజుల్లో అరెస్ట్ కావచ్చని నిన్న స్వయంగా చంద్రబాబు నాయుడు మీడియాకు చెప్పడం గమనార్హం. ఈ సందర్భంగా తాజాగా వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు.

రేపో మాపో తనను అరెస్ట్ చేస్తారంటూ సానుభూతి డ్రామాలాడుతున్నారు చంద్రబాబు గారు. తన భార్యను అవమానించారంటూ గతంలో గుక్కపెట్టారు. ఎన్నికల ముందు తనకు ప్రజలంతా వలయంలా నిలబడి కాపాడుకోవాలని నాటకాలాడినా ఎవరూ పట్టించుకోలేదుగా బాబూ గారూ! మొన్నటిదాకా ఆంధ్రాను శ్రీలంకతో పోల్చి శునకానందం పొందారు చంద్రబాబు గారు. ఇప్పుడు ఆంధ్రా-తెలంగాణను ఉత్తర-దక్షిణ కొరియాలంటూ ఏదేదో మాట్లాడుతున్నారు. ఎక్కడైనా సైకియాట్రిస్ట్ కి చూపించుకోండి అన్నా వినకుండా రోడ్లపై తిరుగుతున్న ఈ ఆంధ్రా కిమ్ కు వ్యాధి బాగా ముదిరి పీక్స్ కు వెళ్ళిపోయింది అని రాసుకొచ్చాడు ఎంపీ విజయసాయి రెడ్డి.

 

Read more RELATED
Recommended to you

Latest news