ఐదుగురు పోలీసులను సస్పెండ్ చేసిన విజయవాడ కమిషనర్..!

-

ఎన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణంలో ఐదుగురు పోలీసులను సస్పెండ్ చేసారు విజయవాడ పోలీస్ కమిషనర్. ఓ దొంగతనం కేసులో నిందితుడి నుంచి సదరు పోలీస్ అధికారులు 6 లక్షల నగదును లంచంగా తీసుకున్నట్లు విచారణలో తేలడంతో ఈ సస్పెండ్ ఆదేశాలు జారీ చేసారు. దొంగతనం కేసులో మొత్తం 25 లక్షలకు గాను 18.5 లక్షలు అని ఉన్నత అధికారులకు చెప్పారు కానిస్టేబుళ్లు.

నిన్న మధిర నుంచి చత్తీస్గడ్ కు లారీలో మిర్చి లోడ్ తీసుకెళ్ళి.. అమ్మి డబ్బు తీసుకోస్తుండగా ఆ డబ్బును దొంగిలించాడు లారీ క్లీనర్. విషయం తెలుసుకున్న ఓనర్ ఫిర్యాదుతో విచారణ చేపట్టారు పోలీసులు. నిందితుడిని పట్టుకొని ఈరోజు పోలీస్ స్టేషన్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి 18.5 లక్షల డబ్బు చూపించారు పోలీసులు. అనంతరం నిందితుడిని విచారణ చేయగా ఐదురుగు కానిస్టేబుళ్లకు 6 లక్షలు ఇచ్చినట్లు ఒప్పుకున్నాడు నిందితుడు. అనంతరం పోలీసులు జరిపిన దర్యాప్తులో డబ్బు తీసుకున్నట్లు తేలడంతో ఆ ఐదురుగు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేసారు విజయవాడ సీపీ.

Read more RELATED
Recommended to you

Latest news