బీజేపీకి షాక్.. పార్టీ మారనున్నవివేక్, విజయశాంతి ?

-

తెలంగాణ రాష్ట్ర బీజేపీకి మరో షాక్ తగులనుంది. బీజేపీ పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారట వివేక్, విజయశాంతి. నిన్న వరంగల్‌ లో జరిగిన ప్రధాని మోడీ సభకు డుమ్మా కొట్టిన వివేక్ వెంకటస్వామి, విజయశాంతి.. పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోది. బీజేపీ పార్టీ కార్యక్రమాలకు గత కొంత కాలంగా దూరంగా ఉంటున్నారు వీ6 ఛానల్ ఓనర్, బీజేపీ నేత గడ్డం వివేక్.

అయితే.. తాజాగా ప్రధాని మోడీ వరంగల్ పర్యటనలో సైతం కూడా కనిపించలేదు వివేక్, విజయశాంతి. దీంతో వివేక్, విజయశాంతి ఇద్దరూ బీజేపీ పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారని వార్తలు వస్తున్నాయి. వీ6 ఛానల్ ఓనర్, బీజేపీ నేత గడ్డం వివేక్… మళ్లీ బీఆర్‌ఎస్‌ కు వెళ్లనున్నారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే వివేక్‌ కు బీఆర్‌ఎస్‌ నుంచి ఆఫర్లు కూడా వచ్చాయట. వీ6 ఛానల్‌ ఉండటంతో.. వివేక్‌ ను మళ్లీ బీఆర్‌ఎస్‌ లోకి రమ్మని గులాబీ బాస్‌ కేసీఆర్‌ పిలిచారట. ఇక విజయశాంతి పార్టీ మారడంపై త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news