విజయనగరం జిల్లాలో విషాదం.. చెక్‌డ్యామ్‌లో ముగ్గురు యువకులు గల్లంతు

-

ఏపీలోని విజయనగరం జిల్లా జామి మండలం జాగరం వద్ద విషాదం చోటుచేసుకుంది. గోస్తని నది వద్ద జామి చెక్‌డ్యామ్‌లో ఆరుగురు యువకులు ఈతకు వెళ్లారు. స్నానానికి అందులో దిగిన కాసేపటికే ప్రమాదవశాత్తు ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. మిగిలిన ముగ్గురు స్థానికులకు సమాచారం అందించగా ఘటనాస్థలికి పోలీసులు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గల్లంతైన ముగ్గురు యువకుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన యువకులు విజయనగరం కంటోన్మెంట్‌ వాసులుగా పోలీసులు గుర్తించారు. ప్రమాదానికి చెక్‌డ్యామ్‌ దిగువన అక్రమ ఇసుక తవ్వకాలే కారణమని స్థానికులు అంటున్నారు.

మరోవైపు గజ ఈతగాళ్లను రంగంలోకి దింపిన పోలీసులు గల్లంతైన యువకుల కోసం గాలిస్తున్నారు. ఆరుగురు స్నేహితులు సరదాగా ఈతకు వచ్చారని.. వారిలో ముగ్గురు ప్రమాదవశాత్తు గల్లంతైనట్లు స్థానికులు చెప్పారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై ఆరా తీస్తున్నట్లు వెల్లడించారు. వీలైనంత త్వరగా గల్లంతైన వారి ఆచూకీ కనిపెడతామని పేర్కొన్నారు. విషయం తెలుసుకున్న గల్లంతైన యువకుల కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news