బుగ్గన చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నాం – బొత్స

-

మూడు రాజధానుల అంశంలో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నామన్నారు ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. మూడు రాజధానులే తమ ప్రభుత్వ విధానము అంటూ స్పష్టం చేశారు. హోల్ సేల్ ఎవరో.. రిటైల్ ఎవరో ఏపీ ప్రజలకు స్పష్టంగా తెలుసని చంద్రబాబును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. చంద్రబాబు హోల్ సేల్ గా అవినీతి చేశాడు కాబట్టే ప్రజల హోల్ సేల్ గా ఇంటికి పంపించారని అన్నారు.

చంద్రబాబు పని అయిపోయిందన్నారు బొత్స సత్యనారాయణ. చంద్రబాబుకు జవసత్వాలు లేవని ఎద్దేవా చేశారు. అసెంబ్లీ సాక్షిగా సీఎం జగన్ , ఆర్ధికమంత్రి బుగ్గన చెప్పిన వికేంద్రీకరణకే కట్టుబడి ఉన్నామన్నారు. లోకేష్ పాదయాత్రలకు ఎవరు భయపడట్లేదని.. లోకేష్ పాదయాత్రను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. అమరావతి శాసన రాజధాని, విశాఖ పరిపాలన రాజధాని, కర్నూలు న్యాయ రాజధాని అని బొత్స వివరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version