నేరాలు చేసే వారు ఎవరైనా సరే కఠినంగా శిక్షించాలి : సీఎం చంద్రబాబు

-

నేరాలు చేసే వారు ఎవరైనా సరే కఠినంగా శిక్షించాలని.. రాజకీయ ముసుగులో చేసినా అలాగే చేయాలని సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. విజయవాడలో అమరులైన పోలీసులకు నివాళులర్పించారు సీఎం చంద్రబాబు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పోలీసుల సంక్షేమమే మా ప్రభుత్వం బాధ్యత అన్నారు. శాంతి భద్రతలు కాపాడటం లో రాజీలేదు. రాష్ట్ర విభజన తరువాత పోలీసుల్లో మార్పులు తీసుకొచ్చాం. ఉమ్మడి రాష్ట్రంలో నక్సలిజాన్ని ఉక్కుపాదాన్ని అణచివేశారు. పోలీసులు పాత టెక్నాలజీని వాడుకుంటే.. నేరస్తులను ఎదుర్కొలేరు.  అందుకే కొత్త ఆయుదాలు సమకూరుస్తున్నాం. 14వేల సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశామని తెలిపారు.ః

గత ప్రభుత్వం సీసీ కెమెరాల కోసం 700 కోట్లు ఇవ్వలేకపోయింది. అవి ఇచ్చి ఉంటే.. రాష్ట్రంలో ఈ అఘాయిత్యాలు జరిగేవి కాదు అన్నారు సీఎం చంద్రబాబు. అప్పులు, వడ్డీలు చెల్లించాలి. పోలీసులందరికీ విజ ప్తి.. నేరాల తీరు మారుతుంది. టెక్నాలజీ పెరిగిన కొద్ది సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. వాళ్ల కంటే మెరుగ్గా చేస్తే.. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయగలుగుతాం. రాజకీయ ముసుగులో నేరాలకు పాల్పడేవారు చాలా మంది ఉన్నారని తెలిపారు చంద్రబాబు. 

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version