ఏపీ ఆర్థిక పరిస్థితి..తెలంగాణ కంటే 7 స్థానాలు పడిపోయింది – యనమల

-

డాయిష్ బ్యాంకు సర్వేలో ఏపీ ఆర్ధికస్థితి 8వ స్థానం నుంచి 11 వస్థానంకు దిగజారడానికి కారకులెవరు? తెలంగాణ కంటే ఏపీ 7 స్థానాలు ఎందుకు పడిపోయింది? అని ఫైర్‌ అయ్యారు టీడీపీ పొలిటి బ్యూరో సభ్యుడు యనమల. ఇది జగన్ రెడ్డి అసమర్ధత కాదా? ఏపీ ఆర్ధికస్థితి ఏడాదికేడాదికి దిగజారుతోందని చెప్పినా జగన్ పెడచెవున పెట్టారని మండిపడ్డారు. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రం క్లాసిక్ డెట్ ట్రాప్‌లోకి వెళుతోందని గత నాలుగేళ్లుగా ఏకరవు పెడుతున్నా దిద్దుబాటు చర్యలు తీసుకోలేదని ఆగ్రహించారు.

ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాద్ రెడ్డి వాస్తవ ఆర్ధిక పరిస్థితిని విశ్లేషించకుండా పదేపదే అబద్దాలను వల్లె వేస్తున్నారని…మన కంటే వనరులు తక్కువ ఉన్న తెలంగాణ ఆర్ధిక స్థితి ఎంతో మెరుగ్గా 4వ స్థానానికి వృద్ధి చెందడం, రాష్ట్రం వెనకబడటం జగన్ రెడ్డి చేతగానితనం కాదా? అంటూ మండిపడ్డారు టీడీపీ పొలిటి బ్యూరో సభ్యుడు యనమల. నిన్నటి వరకు విద్యుత్ వినియోగదారులపై రూ.57 వేల కోట్ల భారాలు వేసి ఇష్టానుసారం దోచుకున్న జగన్ రెడ్డి నేడు విద్యుత్ ఉద్యోగుల నిధులపై పడ్డాడు…మద్యం బాండ్లతో రూ.16 వేల కోట్లు అప్పులు తెచ్చిన జగన్ రెడ్డి నేడు మరో రూ. 11,600 కోట్లు అప్పులు తెచ్చేందుకు బాండ్ల వేలానికి వెళుతున్నాడని ఫైర్‌ అయ్యారు. మద్యం బాండ్లలోకి విద్యుత్ ఉద్యోగుల పిఎఫ్, పెన్షన్ నిధులు మళ్లించే హక్కు మీకెవరిచ్చారు? 2018 లో రూ.16 వేల కోట్లు ఉన్న రెవెన్యూ లోటు నేడు రూ.40 వేల కోట్లకు ఎందుకు పెరిగింది? అన్నారు టీడీపీ పొలిటి బ్యూరో సభ్యుడు యనమల.

Read more RELATED
Recommended to you

Latest news