2 రోజుల్లో టీడీపీలో చేరనున్న వైసీపీ ఎమ్మెల్యే వసంత !

-

 

వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్..పార్టీ మారేందుకు సిద్ధం అయ్యారు. 2 లేదా 3 రోజుల్లో టీడీపీలో చేరనున్నారు వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్. ఇందులో భాగంగానే మైలవరంలో స్పీడు పెంచారు ఎమ్మెల్యే వసంత. ఇప్పటికే మైలవరం నుంచి పోటీకి టీడీపీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు చెబుతోంది వసంత వర్గం.

Mylavaram YCP MLA Vasantha joins the party in Janasena

నిన్న మైలవరం టీడీపీ మండల పార్టీ నేతలతో టెలీ కాన్ఫరెన్స్ లో మాట్లాడిన వసంత….విబేధాలు పక్కన పెట్టి కలిసి చేద్దామని నేతలతో చెప్పారట. ఇవాళ మైలవరంలో కొందరు టీడీపీ నేతల ఇంటికి వెళ్లి వ్యక్తిగతంగా కలవనున్నారు వసంత. ఇప్పటికే ఇక్కడ టికెట్ ఆశించిన మాజీ మంత్రి దేవినేని ఉమాను పిలిచి మాట్లాడారు చంద్రబాబు. పార్టీ కోసం పనిచేసిన తనకు టికెట్ ఇవ్వాలని నిన్న ఆత్మీయ సమావేశం పెట్టారు బొమ్మసాని సుబ్బారావు. కానీ మైలవరం టికెట్‌ వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కు ఇచ్చేందుకు చంద్రబాబు డిసైడ్‌ అయ్యారట. దీంతో 2 లేదా 3 రోజుల్లో టీడీపీలో చేరనున్నారు వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్.

Read more RELATED
Recommended to you

Latest news