వైసీపీ అధికారంలోకి రావడం కష్టమే – వైసీపీ నేత సంచలనం

-

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్లీ మనమే అధికారంలోకి వస్తున్నామని, ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వలేని వారికి భవిష్యత్తులో రాజ్యసభ, ఎమ్మెల్సీ పదవులు ఇస్తానని పలువురు నాయకులను జగన్ మోహన్ రెడ్డి గారు మభ్యపెడుతున్నట్లుగా తెలిసిందని రఘురామకృష్ణ రాజు గారు అన్నారు. ఎమ్మెల్యేలతో ఆడుదాం కార్యక్రమంలో భాగంగా మరో 10 మంది ఎమ్మెల్యేలకు జగన్ మోహన్ రెడ్డి గారు ఝలక్ ఇచ్చారని అన్నారు.

ఎమ్మెల్యేలు మధుసూదన్ రెడ్డి గారు, సిద్ధారెడ్డి గారు, కరుణం ధర్మ శ్రీ గారు, ఉష శ్రీ చరణ్ గారు, ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేది లేదని తేల్చి చెప్పినట్లుగా టీవీల్లో వార్త కథనాలు వచ్చాయని అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన విందుకు హాజరైన వారిలో ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఉన్నారని, రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన విందుకు ఆహ్వానం లేకుండానే వైకాపా ఎంపీలు హాజరయ్యారని, పిలవకపోయినా సహచర ఎంపీ, ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టడంతో అభినందించారని తాను ఎంతో గొప్పగా చెప్పానని, అయితే తెలుగు రాష్ట్రాల ఎంపీలను అందరిని ఆహ్వానించాలని రేవంత్ రెడ్డి కోరినట్లు తెలిసిందని అన్నారు. ప్రస్తుత తమ పార్టీ ఎంపీలు తన వ్యాఖ్యలతో నొచ్చుకున్నట్లయితే మన్నించాలని రఘురామకృష్ణ రాజు గారు కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news