బీజేపీకి పురందేశ్వరి వెన్నుపోటు – విజయసాయి కౌంటర్‌

-

పురంధరేశ్వరిపై మరోసారి వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి విమర్శలు చేశారు. బీజేపీ పార్టీకి వెన్నుపోటు పొడుస్తున్నావా అంటూ పురంధరేశ్వరిపై మరోసారి వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి ఆగ్రహించారు. అమ్మా పురందేశ్వరి గారూ…తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీకి మీ మరిది గారి టీడీపీ బహిరంగంగా మద్దతు ఇవ్వటాన్ని భరించలేక అక్కడ బీసీ నాయకుడు తన పదవికి రాజీనామా చేశాడని పేర్కొన్నారు.

Purandeshwari’s complaint to the Supreme Court against Vijaya Sai Reddy

కాంగ్రెస్‌కు నేరుగా మద్దతు పలుకుతున్న టీడీపీకి మీరు ఏపీలో నేరుగా మద్దతు పలుకుతున్నారంటే… మీది కుటుంబ రాజకీయమా? అని నిలదీశారు. ఇది కుల రాజకీయమా? కుటిల రాజకీయమా? లేక బీజేపీని వెన్నుపోటు పొడిచే మీ రాజకీయమా? అంటూ ప్రశ్నించారు విజయసాయిరెడ్డి.

ఏపీలో మద్యం స్కాం అంటూ ఆరోపణలు చేసి, మీరు, మీ కుటుంబసభ్యులు మద్యం సిండికేట్ బ్రోకర్లతో మీ భర్త వెంకటేశ్వరరావు గారు, మీ కుమారుడు హితేష్, గీతం భరత్ బేరాలాడి ముడుపులు తీసుకున్నది నిజం కాదా ? అని నిలదీశారు. హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్ట్రిక్ట్ లో అత్యంత ఖరీదైన విల్లాను ఎలా నిర్మిస్తున్నారు? ఆ విల్లాకు సొమ్ములు పెడుతున్నది ఎవరు? అని ప్రశ్నించారు సాయిరెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news