మూడు నెలల్లో వైసీపీకి ఎక్స్పైరీ వస్తుంది – చంద్రబాబు

-

రాష్ట్రాన్ని సీఎం జగన్ విధ్వంసం చేస్తున్నాడని ఆరోపించారు టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ ప్రాంతానికి ఎవరు ఎంత న్యాయం చేశారో తెలియచేయడం కోసం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టానన్నారు. దేశంలోనే అనంతపురం పేద జిల్లా అని.. తాము నీళ్లు ఇచ్చిన తర్వాత జిల్లా బాగుపడిందన్నారు. అనంతపురంకు నీళ్లు పట్టిసీమ పుణ్యమేనన్నారు. ఇక వర్షాదార పంటలు బాగా దెబ్బతిన్నాయన్నారు.

 

గోదావరి నీళ్లు రాయలసీమకు ఇవ్వడమే నా జీవిత ఆశయం అన్నారు చంద్రబాబు. జగన్మోహన్ రెడ్డి ఎవరికో పుట్టిన బిడ్డను నా బిడ్డ అని చెప్పుకుంటాడని.. దానిపైనే ఆర్గ్యుమెంట్ పెడతాడని అన్నారు. మూడు నెలల్లో వైసీపీకి ఎక్స్పైరీ వస్తుందని.. ఇక జీవితంలో వైసీపీ అధికారంలోకి రాదన్నారు. నీళ్లు లేని ప్రాజెక్టుకు పెద్దిరెడ్డి కోసం ప్రాజెక్టు కడుతారా..? అని ప్రశ్నించారు. వీళ్లకు భయం లేదు, ప్రజలంటే లెక్కలేదన్నారు. ఎవడికి డబ్బులు ఇవ్వరు పెద్దిరెడ్డికి మాత్రం ఇస్తారని దుయ్యబట్టారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version