నేడు వైసీపీ యువత పోరు కార్యక్రమం

-

నేడు వైసీపీ యువత పోరు కార్యక్రమం నిర్వహించనున్నారు. నిరుద్యోగుల పక్షాన వైసీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో పోరుబాట కొనసాగించనుంది వైసీపీ పార్టీ. నిరుద్యోగ భృతి విడుదల చేయాలంటూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది వైసీపీ.

YCP will hold a youth struggle program today
YCP will hold a youth struggle program today

కలెక్టరేట్ల ఎదుట వైసీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో ధర్నాలు కూడా చేస్తోంది. ఇది ఇలా ఉండగా వైసీపీ పార్టీకి మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. వైసీపీ కేంద్ర కార్యాలయానికి తాడేపల్లి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 21న పార్టీ కేంద్ర కార్యాలయంపై తాటికాయలు విసిరారు దుండగులు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు వైసీపీ నేత అంకంరెడ్డి నారాయణ. ఈ తరుణంలోనే కార్యాలయం CCTV ఫూటేజ్ ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news