వైసీపీ పార్టీకి మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. వైసీపీ కేంద్ర కార్యాలయానికి తాడేపల్లి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 21న పార్టీ కేంద్ర కార్యాలయంపై తాటికాయలు విసిరారు దుండగులు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు వైసీపీ నేత అంకంరెడ్డి నారాయణ.

ఈ తరుణంలోనే కార్యాలయం CCTV ఫూటేజ్ ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు పోలీసులు. కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నివాసం వద్ద కొంతమంది ఆకతాయిలు హంగామా చేశారు. కారులో జగన్ ఇంటి ముందుకు వచ్చి తాటికాయ విసిరారు. సెక్యూరిటీ బారికేడ్ల వద్ద తాటికాయలు పడడంతో పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ వారు పట్టించుకోవడం లేదని వైసిపి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైకోర్టు హెచ్చరించినప్పటికీ జగన్మోహన్ రెడ్డికి Z+ కేటగిరి భద్రత కల్పించడంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని వైసిపి నేతలు ఆరోపిస్తున్నారు.