AP: రాష్ట్రంలో విషాదం చోటుచేసుకుంది. ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నిన్న సత్తెనపల్లిలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ఓ యువకుడు మృతి చెందిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి తాజాగా సీసీటీవీ ఫుటేజీ రిలీజ్ అయింది. ఇంజనీరింగ్ పూర్తి చేసిన జయవర్ధన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని చూడడానికి గడియారం స్తంభం వద్దకు వచ్చాడు. నిన్న అక్కడ విపరీతంగా ఎండ కొట్టింది.

కాన్వాయ్ ఆలస్యం కావడంతో ఎండ వేడి భరించలేక జయవర్ధన్ రెడ్డి ఓ షాప్ ముందు ఉన్న నీడ వద్ద వచ్చి కూర్చున్నాడు. కాసేపటికి ఏమైందో తెలియదు సొమ్మసిల్లి కళ్ళు తిరిగి పడిపోయాడు. దీంతో అక్కడ ఉన్న వారంతా జయవర్ధన్ రెడ్డిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లుగా వైద్యులు దృవీకరించారు. వెంటనే జయవర్ధన్ తల్లిదండ్రులకు ఈ విషయాన్ని తెలపగా అక్కడికి చేరుకున్న జయవర్ధన్ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కాగా, ఈరోజు సాయంత్రం లోపు జయవర్ధన్ అంత్యక్రియలు జరగనున్నాయి.
వైసీపీ కార్యకర్త మృతి తొక్కిసలాటగా ప్రచారం.. సంచలన వీడియో విడుదల
వైఎస్ జగన్ పర్యటనలో అస్వస్థతకు గురై వైసీపీ కార్యకర్త మృతిని తొక్కిసలాట అంటూ @ysjaganపై అధికార పార్టీ, అనుకూల మీడియాలో ప్రచారం
అస్వస్థతతో మృతిచెందిన జయవర్ధన్ రెడ్డి సీసీ కెమెరా ఫుటేజీ ల… pic.twitter.com/YOyWvOkGge
— Telugu Feed (@Telugufeedsite) June 18, 2025