వై.యస్.రాజశేఖరరెడ్డి 14వ వర్ధంతి కార్య‌క్ర‌మం

-

వైసీపీ కేంద్ర కార్యాలయంలో వై.యస్.రాజశేఖరరెడ్డి 14వ వర్ధంతి కార్య‌క్ర‌మం నిర్వహించనున్నారు వైసీపీ పార్టీ నేతలు. ఈ సందర్భంగా వైఎస్‌ రాజశేఖర రెడ్డికి ఘనంగా నివాళులు అర్పించనుంది వైసీపీ పార్టీ. పలు స్వచ్ఛంద కార్యక్రమాలు చేపట్టనున్నాయి పార్టీ శ్రేణులు. ఇక ఈ కార్యక్రమంలో సజ్జల రామకృష్ణా రెడ్డి, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు పాల్గొననున్నారు.

కాగా,ఇవాళ కడప జిల్లాలో సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటించనున్నారు. ఇందులో భాగంగానే ఇవాళ ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి ఇడుపులపాయ చేరుకోనున్నారు సీఎం జగన్‌. వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి వర్ధంతి సందర్భంగా వైఎస్‌ఆర్‌ ఘాట్‌ వద్ద జరిగే ప్రత్యేక ప్రార్ధనల్లో పాల్గొని నివాళులు అర్పించనున్నారు ముఖ్యమంత్రి జగన్‌. అనంతరం వైఎస్సార్‌ ఎస్టేట్‌లోని గెస్ట్‌హౌస్‌కు చేరుకోనున్న సీఎం జగన్‌… మధ్యాహ్నం రెండు గంటలకు తాడేపల్లికి చేరుకోనున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news