జనసేనకు మరో షాక్.. కీలక నేత రాజీనామా

-

సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ జనసేన పార్టీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే ఆయా నియోజకవర్గాల నుంచి కీలక నేతలు పార్టీని వీడి అధికార వైసీపీలో చేరిన విషయం తెలిసిందే.

తాజాగా అదే బాటలో మరో కీలక నేత అమలాపురం లోక్ సభ నియోజకవర్గ ఇన్‌చార్జి డీఎంఆర్ శేఖర్ జనసేన ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను శుక్రవారం సాయంత్రం జనసేనాని పవన్ కల్యాణ్‌కు పంపించారు. అమలాపురం లోక్ సభ టికెట్ ఆశించిన ఆయన..టికెట్ రాకపోవడంతో అసంతృప్తికి గురయ్యారు. కాగా, 2019 పార్లమెంట్ ఎన్నికల్లో జనసేన తరపున పోటీ చేసిన శేఖర్ ఓటమి చెందారు. ఈ క్రమంలోనే ఈసారి అమలాపురం పార్లమెంట్ లేదా? అసెంబ్లీ టికెట్ వస్తుందని ఆశించినప్పటికి చివరకు నిరాశే ఎదురవడంతో పార్టీకి గుబ్ బై చెబుతున్నట్లు వెల్లడించారు. ఆయన ఏ పార్టీలో చేరుతారో తెలియాల్సి ఉంది.

 

Read more RELATED
Recommended to you

Latest news