తెలంగాణలో మా మద్దతు వారికే : తమ్మినేని ప్రకటన

-

సీపీఐఎం నేత తమ్మినేని వీరభద్రంతో డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క భేటీ ముగిసింది. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. రాబోయే లోక్ సభ ఎన్నికల్లో సీపీఐఎం మద్దతు మాకే ఉంటుందని అని భావిస్తున్నట్లు తెలిపారు.ఇండియా కూటమిలో సీపీఎం మిత్రపక్షంగా ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లోనే కలిసి పనిచేయాలని భావించాం. కానీ, వారు అడిగిన సీట్లు ఇవ్వలేకపోయాం అని పేర్కొన్నారు. భవిష్యత్‌లో మా వంతు సహాయ సహకారాలు సీపీఐఎంకు ఉంటాయని భట్టి హామీ ఇచ్చారు.

అనంతరం తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ.. తెలంగాణలో బీజేపీని ఓడించడమే తమ లక్ష్యమని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి మినహా మిగిలిన అన్ని స్థానాల్లో కలిసొచ్చే పార్టీలకు మద్దతు ప్రకటిస్తామని స్పష్టం చేశారు.తాము పోటీలో లేని చోట తప్పకుండా కాంగ్రెస్‌కు మద్దతు ఉంటుందని ఆయన అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news