రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో మరో ట్విస్ట్

-

రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో అనుమానితుడిగా ఉన్న డైరెక్టర్ క్రిష్ హైకోర్టులో దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ను విత్ డ్రా చేసుకున్నారు. డ్రగ్స్ టెస్ట్ కోసం ఆయన బ్లడ్, యూరిన్ సేకరించిన అధికారులు వాటిని ల్యాబ్ కి పంపారు. యూరిన్ టెస్టులో నెగటివ్ రావడంతో ఆయనపై పోలీసులు చర్యలు తీసుకునే అవకాశం లేనట్లు తెలుస్తోంది.. దీంతో పిటిషన్ విత్ డ్రా చేసుకున్నట్లు సమాచారం.

కాగా,ఇటీవల కాలంలో టాలీవుడ్ లో డ్రగ్స్ కేసులలో ప్రముఖులు విచారణ ఎదుర్కొంటున్నారు. తాజాగా టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ క్రిష్ పేరు డ్రగ్స్ కేసులు బయటికి రావడంతో విచారణకు హాజరు కావాలని పోలీసులు  పలుమార్లు ఆదేశించారు.తొలుత విచారణకు వస్తానని అంగీకరించిన డైరెక్టర్ క్రిష్.. తర్వాత పోలీసులు అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టులో  పిటిషన్ దాఖలు వేశారు. తిరిగి సోమవారం ( మార్చి 4) పిటిషన్ ను విత్ డ్రా చేసుకుంటున్నట్లు క్రిష్ తరపు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. అయితే ఇటీవల పోలీసుల విచారణకు డైరెక్టర్ క్రిష్ హాజరు అయిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news