ఏపీ అడిషనల్ డీజీ కార్ కు ప్రమాదం.. త్రుటిలో !

-

కృష్ణాజిల్లా కంచెకచర్ల సమీపంలో అడిషనల్ డీజీ కృపానంద్ త్రిపాటి ఉజేలాకు పెను ప్రమాదం తప్పింది. ఆయన హైదరాబాద్ నుంచి విజయవాడ కు వెళ్తుండగా  ద్విచక్ర వాహనాన్ని ఢీ కొంది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనదారులకు  తీవ్ర గాయాలు కాగా 108 వాహనంలో హాస్పటల్ కు తరలించారు. క్షతగాత్రుడు కంచికచర్ల పట్టణానికి చెందిన వ్యక్తి అని తెలుస్తోంది.

ఇక ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టి కారు రహదారి పక్కన కందకంలోకి దూసుకెళ్లంది. అయితే ప్రమాదంలో డీజీకి ఎటువంటి గాయాలు కాలేదు. ఆయనని వెంటనే వేరొక కారులో షిఫ్ట్ చేసి అక్కడి నుంచి ఆయనని సెక్యూరిటీ సిబ్బంది తరలించారు. ఈ ఉదయం కూడా కృష్ణాజిల్లాలో ఒక రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడిక్కడే చనిపోయారు. ఆగి ఉన్న లారీని వేగంగా వెళుతున్న కారు ఢీ కొనడంతో ఏడుగురితో వెళ్తోన్న ఇన్నోవా వాహనం పూర్తిగా దెబ్బతిన్నది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version