ఏపీలో భారీగా తగ్గిన కరోనా.. ఇవాళ 1627 కేసులు

-

ఏపీలో కరోనా మహమ్మారి కేసులు పెరుగుతూ.. తగ్గుతూ వస్తూ ఉన్నాయి. నిన్న పెరిగిన కేసులు ఇవాళ ఒక్క సారిగా పడిపోయాయి. అయితే తాజాగా నిన్నటి కంటే ఈ రోజు కాస్త తగ్గాయి కరోనా కేసులు. తాజాగా ఏపీ వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1627 కరోనా కేసులు నమోదయ్యాయి.

దీంతో ఆంధ్ర ప్రదేశ్‌ లో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 19,53,497 కి పెరిగింది. ఒక్క రోజు వ్యవధిలో మరో 17 మంది చనిపోవడంతో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 13,273 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 21,748 యాక్టివ్‌ కరోనా కేసులు ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో 2017 మంది బాధితులు కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇక ఇప్పటి దాకా కరోనా బారిన పడి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 19,18,476 లక్షలకు చేరింది. ఇక నిన్న ఒక్క రోజే ఏపీలో 57,672 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ఇప్పటి దాకా 2, 41, 92, 633 కరోనా పరీక్షలు చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version