ఏపీ కరోనా అప్డేట్… కొత్తగా 1,174 కేసులు

-

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రం లో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. ఏపీ లో నిన్న పెరిగిన కరోనా కేసులు ఇవాళ మళ్లీ తగ్గాయి. తాజాగా ఏపీ వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1174 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఆంధ్ర ప్రదేశ్‌ లో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 20,37, 353 కి పెరిగింది.

ఒక్క రోజు వ్యవధిలో మరో 09 మంది చనిపోవడంతో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 14, 061 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 14, 653 యాక్టివ్‌ కరోనా కేసులు ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో 1309 మంది బాధితులు కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇక ఇప్పటి దాకా కరోనా బారిన పడి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 20,08, 639 లక్షలకు చేరింది. ఇక నిన్న ఒక్క రోజే ఏపీలో 55, 525 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ఇప్పటి దాకా 2, 76, 52, 514 కరోనా పరీక్షలు చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version