ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాలలోని వారికి ట్యాబ్ లను ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. శనివారం నెల్లూరులో మెప్మా మహిళలు అధికారులతో నారాయణ సమీక్ష కార్యక్రమాన్ని చేపట్టారు.

ఈ సందర్భంగానే రాష్ట్రంలోని స్వయం సహాయక సభ్యులకు 9000 ట్యాబ్ లు అందించనున్నట్లుగా వెల్లడించారు. అలాగే విజయదశమి నాటికి టిడ్కో ఇల్లు లబ్ధిదారులకు అందిస్తామని మంత్రి పొంగూరు నారాయణ స్పష్టం చేశారు. కాగా మరోవైపు ఏపీలో ఆలయ అభివృద్ధి కార్యక్రమాలను కూడా చేపడుతున్నారు. తిరుమల తరహా లోనే 22 ప్రముఖ దేవాలయాలలో భక్తుల సౌకర్యాల కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తున్నారు. పరిశుభ్రత, భోజన సదుపాయం, నిత్యవసర సౌకర్యాలపై దృష్టిని చేపడుతున్నారు. దీంతో ఏపీ వాసులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.