ఏపీలో 24 గంటల్లో 376 కొత్త కేసులు..!

-

కరోనా మహమ్మారి ఆంధ్రప్రదేశ్ లో కోరలు చాచింది.. దీని ధాటికి ప్రజలు గజగజ వణికిపోతున్నారు. పరీక్షల సంఖ్య పెరుగుతున్న కొద్దీ కేసుల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. అయితే మిగిలిన రాష్ట్రాలతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ లో మృతుల సంఖ్య కొంచం అదుపులోనే ఉన్నట్టు తెలుస్తుంది. ఇది ఒకింత శుభమే అయినా.. రానున్న రోజుల్లో ఇది ఎలా మారుతుందో అర్ధం కావట్లేదు. కాగా, రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 376 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో ఏపీలో మొత్తం నమోదైన కరోనా కేసుల సంఖ్య 6,230కి చేరుకుంది. అలాగే నేడు కొత్తగా 82 మంది డిశ్చార్జ్ అవ్వగా మొత్తం డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 3065. ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారి సంఖ్య 3069గా ఉండగా ఇప్పటి వరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 96కి చేరుకుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version