ఏపీలో కొత్తగా 130 కరోనా కేసులు, ఒక మరణం

-

ఏపీలో మొన్నటి వరకు తగ్గిన కరోనా మహమ్మారి కేసులు.. ఇప్పుడు కాస్త పెరిగి పోయాయి. తాజాగా ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం… ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా… గడిచిన 24 గంటల్లో కొత్తగా.. 130 మందికి కోవిడ్ 19 పాజిటివ్ గా నిర్దారింప బడింది. దీంతో ఆంధ్ర ప్రదేశ్‌ లో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 2076979 కి పెరిగింది.

ap carona

ఒక్క రోజు వ్యవధిలో మరో ఒక్కరు చనిపోవడంతో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 14, 493 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1081 యాక్టివ్‌ కరోనా కేసులు ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో 97 మంది బాధితులు కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇక ఇప్పటి దాకా కరోనా బారిన పడి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 2061405 లక్షలకు చేరింది. ఇక నిన్న ఒక్క రోజే ఏపీలో 33,188 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ఇప్పటి దాకా 3,12,95,287 కరోనా పరీక్షలు చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version