ఏపీలో కాస్త శాంతించిన కరోనా.. కొత్తగా 12,926 కేసులు

-

ఏపీ కరోనా కేసులు క్రమ క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. అయితే.. ఇవాళ నిన్నటి కంటే.. కాస్త తగ్గాయి కరోనా మహమ్మారి కేసులు. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం… ఏపీ వ్యాప్తంగా గడిచిన 24 గంటల లో కొత్తగా 12, 926 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఆంధ్ర ప్రదేశ్‌ లో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 21,66, 194 కి పెరిగింది.ఒక్క రోజు వ్యవధిలో మరో ఆరుగురు చనిపోవడంతో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 14, 538 కి చేరింది.

ప్రస్తుతం రాష్ట్రంలో 73,143 యాక్టివ్‌ కరోనా కేసులు ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో 3913 మంది బాధితులు కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇక ఇప్పటి దాకా కరోనా బారిన పడి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 20, 78 , 513 లక్షలకు చేరింది. ఇక నిన్న ఒక్క రోజే ఏపీలో 43, 763 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ఇప్పటి దాకా 3, 21, 00 , 381 కరోనా పరీక్షలు చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Latest news