“మంత్రి పెద్దిరెడ్డిని విమర్శించే అర్హత చంద్రబాబుకు లేదు”

-

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో భాగంగా అధికార మరియు ప్రతిపక్ష నాయకులకు మధ్యన వాదోపవాదనలు సహజంగా జరుగుతూ ఉంటాయి. ఇక తాజాగా పుంగనూరు ఎమ్మెల్యే మరియు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గురించి మాజీ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యల పట్ల డిప్యూటీ సీఎం నారాయణ స్వామి తీవ్రంగా విమర్శించారు. ఈ రాష్ట్రంలో ఉన్న టీడీపీ నేతలు అంతా కూడా మానవత్వం ఏమాత్రం లేని మనుషులంటూ రెచ్చిపోయి మాట్లాడారు నారాయణ స్వామి. రాష్ట్రంలో శాంతి లేకుండా చేయడానికి టీడీపీ అండ్ కో కుట్రలు చేస్తున్నారని నారాయణస్వామి మండిపడ్డారు. ఇక ఈ మధ్యన పుంగనూరు లో జరిగిన ఘటనకు చంద్రబాబు ప్రధాన కారకుడు అంటూ నారాయణస్వామి దుయ్యబట్టారు. ఇక చంద్రబాబు అంటేనే వెన్నుపోటుకు మరో పేరంటూ నారాయణ స్వామి గుర్తు చేశారు.

అలాంటి చంద్రబాబుకు మంత్రి పెద్దిరెడ్డిని విమర్శించే అర్హత లేదంటూ చంద్రబాబు పై విమర్శలు చేశారు. మరి దీనిపై టీడీపీ నుండి లోకేష్ లేదా మరేతర నాయకుడు ఎవరైనా స్పందిస్తారా అన్నది తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news