ఏపీలో కరోనా విజృంభణ.. ఆ యువ మాజీ మంత్రికి కరోనా..!

-

కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా విలయతాండవం చేస్తుంది. భారత్ పై దీని ప్రభావం మరింత తీవ్రంగా ఉంది. రోజురోజుకి పెరిగిపోతున్న కేసులతో ప్రజలు హడలిపోతున్నారు. సాధారణ ప్రజలతో పాటూ అధికారులు, ప్రజాప్రతినిధులు సైతం కరోనా బారిన పడుతున్నారు. అలాగే ఈ మహమ్మారి సోకి ఇప్పటికే అనేకమంది మరణించగా.. మరికొందరు కొలకుని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అయితే తాజాగా.. ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, టీడీపీ నేత కిడారి శ్రావణ్ కుమార్ కూడా కరోనా వైరస్ బారినపడ్డారు.

గత కొద్దిరోజులగా జ్వరంతో బాధపడుతున్న ఆయన.. విశాఖపట్టణంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో కరోనా పరీక్ష చేయించుకోగా.. పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. దీంతో వైద్యుల సలహా మేరకు ఆయన ఆస్పత్రిలో చేరారు. కాగా, ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది లీడర్లు ఈ మహమ్మారి బారిన పడ్డారు. అయితే అందులో కొంతమంది కొలుకోగా.. మరికొందరు కొలుకోవాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news