మ‌రో సీనియ‌ర్ జర్నలిస్ట్‌కు ఏపీ ప్రభుత్వం కీలక పదవి..

-

ఇటీవ‌ల సీనియర్ జర్నలిస్ట్ దేవులపల్లి అమర్, సజ్జల రామకృష్ణారెడ్డి, డాక్టర్‌ కొండు భట్ల రామచంద్రమూర్తిల‌ను ఏపీ ప్రభుత్వ సలహాదారులుగా అరుదైన గౌరవం క‌ట్ట‌బెట్టిన విష‌యం తెలిసిందే. ఇక తాజాగా మ‌రో సీనియ‌ర్ జర్నలిస్ట్ అయిన‌ స్వప్న కు కీలక పదవి కట్టబెట్టారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన మీడియా అయిన svbc ఛానల్ కు డైరెక్టర్ గా ఆమెను నియమించినట్టు తెలుస్తోంది.

సాక్షి న్యూస్ తెలుగు లో మేనేజింగ్ ఎడిటర్ గా బాధ్యతలను నిర్వర్తించిన స్పప్న తరువాత కెరీర్ పరంగా ఎన్నో ప్రయోగాలను చేశారు. ఇక నాలుగు రోజుల కిందటే ఏపీ ప్రభుత్వం ఆమెకు సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. త్వరలో మంచి ముహూర్తం చూసుకొని svbc డైరెక్టర్ గా స్వప్న బాధ్యతలు చేపట్టనున్నట్టు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news