ఒకే రోజు.. ఒకే జిల్లాలో పర్యటించనున్న చంద్రబాబు, సీఎం జగన్..

-

అధికార ప్రతిపక్షాల బలాబలాలకు నెల్లూరు జిల్లా వేదిక కానుంది. మాజీ ముఖ్య మంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటన ఖరారైంది. ఈ నెల 14, 15 తేదీల్లో ఆయన నెల్లూరు జిల్లాలో పర్యటించి నియోజకవర్గాల వారీగా సమీక్షించనున్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా రైతుల సంక్షేమం కోసం ఈ నెల‌ 15న నెల్లూరు జిల్లాలో ‘రైతు భరోసా’ పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించనున్నారు.

దీంతో ఇద్దరి భద్రత పోలీసులకు సవాల్ గా మారింది. వీరి పర్యటనలలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి పర్యటనలతో జిల్లాలో సందడి వాతావరణం నెలకొంది. దీంతో ఎన్నికల అనంతరం జిల్లాలో అరుదైన సంఘటన చోటుచేసుకోబోతోంది.

Read more RELATED
Recommended to you

Latest news