జగనన్న విద్యా కానుక పథకం విషయంలో ఏపీ సర్కార్ కీలక నిర్ణయం

-

వచ్చే అకడెమిక్ ఇయర్ నుంచి జగనన్న విద్యా కానుక పథకం కింద ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో విద్యార్థి కిట్ల పంపిణీకి ప్రభుత్వం పాలనానుమతి జారీ చేసింది. 2021-22 విద్యా సంవత్సరంలో 730 కోట్ల వ్యయంతో విద్యార్ధులకు మూడు జతల యూనిఫాం, పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు, ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు అందించాల్సిందిగా పాఠశాల విద్యాశాఖకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

CM Jagan Mohan Reddy
CM Jagan Mohan Reddy

జగనన్న విద్యా కానుక పథకంలో భాగంగా ఈసారి విద్యార్థులకు ఇచ్చే కిట్లలో ఒక డిక్షనరీ కూడా అందించాలని ప్రభుత్వం ఆదేశించింది. 1-10 తరగతి వరకు ప్రభుత్వ, మండల పరిషత్, పురపాలక, రెసిడెన్షియల్, ఆశ్రమ, ఎయిడెడ్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులందరికీ జగనన్న విద్యా కానుక కిట్లు పంపిణీ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఈ పథకం అమలు కోసం రూ. 500.62 కోట్ల మేర రాష్ట్ర ప్రభుత్వం, రూ. 230.68 కోట్లను కేంద్ర ప్రభుత్వం భరిస్తాయని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news