బ్రేకింగ్: గంటా శ్రీనివాసరావుకి సర్కార్ షాక్

-

ఏపీలో టీడీపీ నేతల అక్రమాల విషయంలో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చాలా వరకు సీరియస్ గా ఉన్న సంగతి తెలిసిందే. అక్రమాలను ఏ మాత్రం కూడా సహించే అవకాశం లేదని రాష్ట్ర సర్కార్ చెప్తుంది. ఇటీవల సబ్బం హరి సహా మరో నేతకు సంబంధించిన అక్రమాలను కూల్చివేశారు. తాజాగా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మీద ఫోకస్ చేసారు. విశాఖ మంగమరిపేట వద్ద ఉన్న గో కార్టింగ్ కూల్చివేస్తున్నారు జీవీఎంసీ అధికారులు..

మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, అనుచరుడుగా ఉన్న కాశీ విశ్వనాథ చెందిన గో కార్టింగ్ ని కూల్చివేస్తున్నారు. వైజాగ్ ప్రొఫైల్స్ నుండి పదేళ్ల పాటు కాశీవిశ్వనాథ్ లీజుకి తీసుకున్నారు. ఎలాంటి నోటీసు లేకుండా అధికారులు తొలగించే కార్యక్రమం చేస్తున్నారు. సీఆర్జెడ్ నిబంధనలు ఉల్లంఘించారు అంటూ తొలగిస్తున్నారు. ఇది పూర్తిగా ప్రైవేటు భూమి అని… ప్రభుత్వానికి సంబంధం లేదు అని పేర్కొన్నారు బాధితులు. ప్రభుత్వ భూమి అంటూ ప్రచారం చేస్తున్నారన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news