వైసిపి నేతలకు ఏపీ హైకోర్టు నోటీసులు

-

వైసిపి నేతలకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వైసీపీ ఎమ్మెల్యే జగన్ మోహన్, ఎమ్మెల్సీ అరుణ్ లకు ఈ నోటీసులు జారీ అయ్యాయి. నందిగామలో నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వకాలు చేస్తున్నారని దాఖలైన పిటిషన్ ను విచారించింది న్యాయస్థానం. చాగల్లు, చెవిటికల్లు, కీసరలలో అక్రమ ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని.. ఫిర్యాదులు చేసిన ఏ శాఖ అధికారులు కూడా చర్యలు తీసుకోవడం లేదని కోర్టుకు తెలిపారు పిటిషనర్.

ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ వారి అనుచరులతో ఇసుక తవ్వకాలు చేయడం వల్ల స్థానికులు ఇబ్బందులు పడుతున్నారని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు పిటిషనర్. దీంతో మైనింగ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ, మైనింగ్ డైరెక్టర్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు నోటీసులు జారీ చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news