కాపుల రిజర్వేషన్లపై ఏపీ హై కోర్టులో జగన్‌ కు చుక్కెదురు !

-

కాపుల రిజర్వేషన్లపై ఏపీ హై కోర్టులో జగన్‌ కు చుక్కెదురైంది. కాపులకు 5 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయాల ని ఏపీ ప్రభుత్వా నికి హైకోర్టు ఆదేశించింది. వచ్చే విచారణలో ఇదే అంశంపై దాఖలైన అన్ని పిటిషన్లను విచారణ చేస్తామని పేర్కొంది ఏపీ ఉన్నత న్యాయస్థానం. ఈ వివాదంపై పిటిషన్ దాఖలు చేశారు మాజీ మంత్రి హరి రామ జోగయ్య.

కేంద్రం 10 శాతం రిజర్వేషన్లను ఇచ్చిన ఆదేశాలపై సుప్రీం కోర్టులో నడుస్తున్న కేసు విచారణ ముగిసినట్టు కోర్టుకు తెలిపారు పిటిషనర్. ఈ కేసు సుప్రీం కోర్టులో విచారణలో ఉందని రిజర్వేషన్లు ఇవ్వలేమన్న ప్రభుత్వం ఇపుడు కేసు విచారణ ముగిసినా ఇవ్వడంలేదని కోర్టు దృష్టికి తెచ్చారు పిటిషనర్ న్యాయవాది రాధా కృష్ణ. అయితే.. దీనిపై కౌంటర్ దాఖలు చేస్తామని కోర్టుకు తెలిపింది జగన్ ప్రభుత్వం. తదుపరి విచారణ వచ్చే నెల 26కి వాయిదా వేసింది ఏపీ హై కోర్టు.

Read more RELATED
Recommended to you

Exit mobile version