ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తల్లికి వందనం నిధుల డబ్బులు ఇంకా రిలీజ్ కాలేదు. దీంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తల్లికి వందనం నిధుల డబ్బులు ఎందుకు విడుదల కాలేదనే విషయంపై మంత్రి నారా లోకేష్ క్లారిటీ ఇచ్చారు. కొందరు తల్లులకు ఇంతవరకు డబ్బులు జమ చేయనప్పటికీ అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా లబ్ధి చేకూరుస్తామని విద్యాశాఖ తెలియజేసింది. పథకంలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలను మంత్రి నారా లోకేష్ ఖండించారు.

ఆరుగురు కంటే ఎక్కువ పిల్లలు ఉన్న తల్లుల వివరాలను పరిశీలిస్తున్నామని చెప్పారు. అర్హులైన వారందరికీ నిధులు అందుతాయని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం హామీ ఇచ్చింది. తప్పుడు కథనాలు ప్రచురించిన వారిపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇదిలా ఉండగా …మరోవైపు ఏపీలో పాఠశాలలో జూన్ 12వ తేదీన ప్రారంభమయ్యాయి. దీంతో విద్యార్థులు ప్రతిరోజూ స్కూళ్లకు వెళ్తున్నారు. స్కూల్లు ప్రారంభమైన రోజే పుస్తకాల పంపిణీ, కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఆరోజు పుస్తకాలు, కిట్ల పంపిణీలో పాల్గొనని విద్యార్థులకు ఈరోజు లేదా రేపు పుస్తకాలు, కిట్లు అందిస్తామని ఉపాధ్యాయులు చెబుతున్నారు.