తెలంగాణ భవన్ లో కోలాహలం నెలకొంది. ఫార్ములా-ఈ రేస్ కేసులో దాదాపు 6 గంటల పాటు కేటీఆర్ ను విచారించింది ఏసీబీ. అవసరమైతే మరోసారి విచారణకు రావలన్నారు అధికారులు. తాను సెల్ ఫోన్ తీసుకురాలేదన్నారు కేటీఆర్. ఇక విచారణ పూర్తి కాగానే తెలంగాణ భవన్ కు కేటీఆర్ వచ్చారు.

దింతో పటాకులు కాల్చారు బీఆర్ఎస్ కార్యకర్తలు. ఈ తరుణంలోనే కేటీఆర్కు హగ్ ఇచ్చి లోపలికి తీసుకెళ్లారు హరీష్ రావు. ఇక ఏసీబీ విచారణ అనంతరం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR మాట్లాడారు. నోటీసుల గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డికి భయపడేది లేదు.. మేము పైసలు పెట్టి పదవులు కొనుక్కోలేదని వెల్లడించారు.15 రోజులు జైల్లో పెట్టి పైశాచిక ఆనందం పొందుతాడేమో తప్ప అంతకంటే ఎక్కువ రేవంత్ రెడ్డి పీకేదేమి లేదన్నారు. పెడితే గిడితే 15 రోజులు జైలులో పెడతాడు తప్ప వాడు పీకేది ఏమీ లేదు.. లొట్టపీసు ముఖ్యమంత్రి అంటూ చురకలు అంటించారు.
తెలంగాణ భవన్లో కోలాహలం
పటాకులు కాల్చిన బీఆర్ఎస్ కార్యకర్తలు
కేటీఆర్కు హగ్ ఇచ్చి లోపలికి తీసుకెళ్లిన హరీష్ రావు pic.twitter.com/QjOKlKFCzB
— Telugu Scribe (@TeluguScribe) June 16, 2025