Breaking : కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్ చీతా.. ఇద్దరు పైలెట్లు అదృశ్యం

-

భారత సైన్యానికి చెందిన హెలికాప్టర్ చీతా అరుణాచల్ ప్రదేశ్‌లోని బొమ్డిలలో గురువారం కూలిపోవడం జరిగింది. విధి నిర్వహణలో భాగంగా వెళ్లిన ఈ హెలికాప్టర్ గురువారం ఉదయం 9.15 గంటలకు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో సంబంధాలను కోల్పోయింది. బొమ్డిలకు పశ్చిమ దిశలో ఉన్న మండల సమీపంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. గువాహటి రక్షణ రంగ ప్రజా సంబంధాల అధికారి లెఫ్టినెంట్ కల్నల్ మహేంద్ర రావత్ ఈ వివరాలను ఓ ప్రకటనలో తెలియచేసారు. దీనిలో పైలట్లుగా ఓ లెఫ్టినెంట్ కల్నల్, ఓ మేజర్ ఉన్నట్లు సమాచారం. గాలింపు బృందాలను రంగంలోకి దించినట్లు ఈ ప్రకటన తెలియచేసింది. వైమానిక దళంలో చేతక్, చీత రకం హెలికాప్టర్లు 200 వరకు సేవలు అందిస్తున్నాయి. ఎత్తైన ప్రదేశాలలో సాయుధ బలగాలకు ఇవి రక్షణగా ఉన్నాయి. కానీ, పాతబడుతున్న నేపథ్యంలో వీటి స్థానాల్లో కొత్త వాటిని తీసుకోవాల్సిన అవసరం చాలానే ఉంది.

గతంలో, జూన్ 3, 2019న అస్సాంలోని జోర్హాట్ నుండి టేకాఫ్ అయిన తర్వాత AN-32 విమానం కూలిపోవడంతో 13 మంది భారత వైమానిక దళ సిబ్బంది మరణించారు.అరుణాచల్ ప్రదేశ్‌లోని మెచుకా అడ్వాన్స్‌డ్ ల్యాండింగ్ గ్రౌండ్ (ALG)కి బయలుదేరిన విమానం మధ్యాహ్నం 1 గంటల సమయంలో గ్రౌండ్ అధికారులతో సంబంధాలు కోల్పోయింది.ఎనిమిది రోజుల పాటు భారీ శోధన మరియు రెస్క్యూ ఆపరేషన్ తర్వాత, అనేక ఏజెన్సీల నుండి ఆస్తులను మోహరించారు, విమానం యొక్క శిధిలాలు Mi-17 ఛాపర్ ద్వారా కనుగొనబడ్డాయి. అరుణాచల్ ప్రదేశ్‌లో ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలింది. IAF యొక్క సుఖోయ్-30, మిరాజ్ 2000 విమాన శకలాలు విచారణ కోసం గ్వాలియర్ ఎయిర్‌బేస్‌కు తరలించబడ్డాయి. జూన్ 20న IAF సిబ్బంది అవశేషాలను వెతికి తీసారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version