రోహిత్ పై ప్రశంసల వర్షం కురిపించిన ఓవైసీ …!

-

ప్రస్తుతం ఇండియా వేదికగా జరుగుతున్న వరల్డ్ కప్ చివరకు చేరుకుంది. 40 రోజులుగా క్రికెట్ అభిమానులను అలరిస్తున్న వరల్డ్ కప్ ఈ ఆదివారం జరగనున్న ఫైనల్ మ్యాచ్ తో ముగియనుంది. కాగా ఇప్పటికే ఇండియా ఫైనల్ చేరుకోగా దేశంలో అందరూ ఇండియన్ క్రికెట్ టీం ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఇక తాజాగా తెలంగాణ రాజకీయ నాయకుడు మరియు AIMIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసి ఇండియన్ టీం గురించి మరియు సారధి రోహిత్ శర్మ గురించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఒవైసి మాట్లాడుతూ రోహిత్ శర్మ వరల్డ్ కప్ లో టీం ఇండియాను అద్భుతంగా ముందుండి నడిపిస్తున్నాడంటూ ప్రశంసల వర్షం కురిపించాడు. రోహిత్ సారథ్యంలో బ్యాట్స్మన్ లు మరియు బౌలర్లు జట్టు విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నారు అంటూ పొగిడారు ఒవైసి.

ఇండియా ఫైనల్ కు అర్హత సాధించడం చాలా గొప్ప విషయం, ఇక ఫైనల్ లోనూ ఇదే విధంగా ఆడి కప్ ను చేజిక్కించుకోవాలని కోరుకుంటున్నా అంటూ ఒవైసి అల్ ది బెస్ట్ చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news