సార్వత్రిక ఎన్నికలవేళ… తిరుపతిలో ఐదుగురు సీఐల బదిలీ

-

మరికొన్ని గంటల్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం కానున్న వేళ మరికొందరు పోలీసు అధికారులపై ఎన్నికల కమిషన్ బదిలీ వేటు వేసింది. ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించి, అధికార పార్టీ నేతలకు అనుకూలంగా వ్యవహరిస్తున్న పలువురు ఉన్నతాధికారులపై ఇప్పటికే చర్యలు తీసుకున్న ఎన్నికల కమిషన్ తాజాగా మరో ఐదుగురు సీఐలపై చర్యలు తీసుకుంది.

తిరుపతికి చెందిన ఐదుగురు సీఐలను అనంతపురం జిల్లాకు బదిలీ చేసింది. వైసీపీ కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ తెలుగుదేశం పార్టీ నేతలు ఫిర్యాదు చేయడంతో.. సీఐలు అంజూయాదవ్‌, అమర్‌నాథ్‌రెడ్డి, జగన్మోహన్‌రెడ్డి,శ్రీనివాసులు, వినోద్‌కుమార్‌లను అనంతపురంలో ఎన్నికల విధులు నిర్వహించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది.

Read more RELATED
Recommended to you

Latest news